పాఠశాలల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని జనసేన పార్టీ వైస్ ఎం‌పి‌పి ఇంటిపల్లి ఆనందరాజు డిమాండ్

జనసేన

                 రాజోలు ( జనస్వరం ) : రాజోలు నియోజవర్గం, రాజోలు మండలం సర్వ సభ సమావేశంలో చింతలపల్లి మెయిన్ వద్ద ఉన్న శిధిలావస్థలో ఉన్న పాఠశాల కోసం మరియు రాజోలు మండలంలో మెయిన్ రోడ్డు పక్కన ఉన్న పాఠశాలల వద్ద పిల్లలకు ప్రమాదం జరగకుండా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని జనసేన పార్టీ వైస్ ఎం‌పి‌పి ఇంటిపల్లి ఆనందరాజు అన్నారు. అలాగే చింతలపల్లి కుమ్మరి వీధిలో అతి ప్రమాదంగా ఉన్న ఎలక్ట్రికల్ ఇనుప స్తంభాల తీసివేసి సిమెంటు స్తంభాలతో విద్యుత్ ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. 

See also  కోన తాతారావును సత్కరించిన జనసేన నాయకులు