పురపాలక పాఠశాలల విలీననాన్ని విరమించుకోవాలని వైసీపీ ప్రభుత్వానికి సూచన : దారం అనిత

దారం అనిత

          చిత్తూరు ( జనస్వరం ) : చిత్తూరు జిల్లా జనసేన ప్రధాన కార్యాదర్శి దారం అనిత మాట్లాడుతూ ఇప్పుడు విద్యాశాఖలో పురపాలక పాఠశాలల విలీనానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. పాఠశాలలతో పాటు ఆస్తుల బదిలీకి సంబంధించి పురపాలక కౌన్సిల్ సమావేశాల్లో తీర్మానాలు చేయాలని ప్రభుత్వం నిర్దేశించింది. దీనివల్ల ఎప్పుడో దాతలిచ్చిన పురపాలక పాఠశాలల ఆస్తుల పరిరక్షణ అన్నది అనుమానమే. రాష్ట్రవ్యాప్తంగా 59 పురపాలక, నగరపాలక సంస్థల ఆధ్వర్యంలో 2వేల 115 పురపాలక పాఠశాలు ఉన్నాయి. వీటిలో నాలుగున్నర లక్షల మంది చదువుతున్నారు. పురపాలక పాఠశాలు అంటేనే నిరుపేద, మధ్యతరగతి విద్యార్థులకు భరోసా అందించే విద్యాకేంద్రాలు. ప్రస్తుతం విద్యాశాఖ పరిధిలో ప్రాథమిక పాఠశాలలను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేస్తున్నారు. ఇప్పుడు మున్సిపల్ పాఠశాలలు కూడా విద్యాశాఖ పరిధిలోకి వస్తే వీటిని కూడా కుదించే అవకాశాలున్నాయి. అదే జరిగితే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పిల్లలకు పురపాలక, నగరపాలక సంస్థల పరిధిలో చదువు దూరమయ్యే ప్రమాదముంది. దీని వెనుక మంచి ఉద్దేశ్యం కనపడడం లేదు, కాబట్టి వెనక పడిన వర్గాలు చదివే పురపాలక పాఠశాలల విలీననాన్ని విరమించుకోవాలని అని జనసేన పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నాను అని అన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way