క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ కార్యక్రమం ప్రతి మండలంలో వేడుకలాగా జరగాలి

        కృష్ణా ( జనస్వరం ) : జనసేన పార్టీ కృష్ణా జిల్లా అధ్యక్షులు బండ్రెడ్డి రామకృష్ణ గారిని జగ్గయ్యపేట నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు విజయవాడలోని వారి కార్యలయంలో మర్యాదపూర్వకంగా కలుసుకోవటం జరిగింది. అందులో భాగంగా నియోజకవర్గ సమస్యలపై మరియు పార్టీ బలోపేతం కోసం అనుసరించాలిసినటువంటి కార్యాచరణ గురించి ప్రస్తావించటం జరిగిందని, అదే విధంగా వచ్చే 2, 3 వారాల్లో నియోజకవర్గంలో పార్టీ తరుపున నిర్వహించబోయే కొన్ని కార్యాక్రమాలకు వారిని ఆహ్వానచించటం జరిగింది అని జిల్లా సంయుక్త కార్యదర్శి ఈమని కిషోర్ కుమార్, మండల అధ్యక్షులు తులసి బ్రహ్మం, తునికపాటి శివ, రేగండ్ల వెంకటరామయ్యా తెలిపారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణ గారు మాట్లాడుతూ గ్రామాల్లో జనసేన పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది అని, గ్రామాల్లో యువ వేదికలు, జనసేన జండా కార్యక్రమాలు నిర్వహించాలి అని, సుదీర్ఘ రాజకీయ ప్రయాణం దిశగా ప్రయాణం చేస్తున్న జనసేన పార్టీ బలమైన యువకులను నాయకులుగా తయారుచేయాలి అని, ప్రతి ఒక్కరు కలిసి పని చేసి పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని, పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి ని చేసుకోటమే మన లక్ష్యం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐటీ విభాగం మెంబెర్ హరికృష్ణ, ప్రవీణ్, వై ఎన్ అర్ మాస్టర్, రామకోటి, షౌకత్ అలీ, గోపి, బాజి, అజయ్ తదితరులు జనసైనికులు పాల్గొన్నారు.