Search
Close this search box.
Search
Close this search box.

వడ్లతురకపల్లిలో ఉండే సమస్యలను తక్షణమే పరిష్కరించాలని జనసేనపార్టీ తరపున డిమాండ్

వడ్లతురకపల్లి

         రాజంపేట ( జనస్వరం ) : టి. సుండుపల్లి మండలంలోని వడ్లతురకపల్లిలో ఉండే సమస్యలను తక్షణమే పరిష్కరించాలని జనసేనపార్టీ తరపున జనసేన నాయకులు రామశ్రీనివాసులు డిమాండ్ చేశారు. ఆయన మాట్లాడుతూ ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన సమస్యలు షేక్ అక్తర్ ఉన్నిశా ఇదే ఊరిలో 15 సం. నుంచి కాపురం ఉంటున్నారు. వారికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కనీసం వాళ్ళకి సొంత ఇంటి స్థలం, గృహం కానీ లేని దీన పరిస్థితిలో ఉన్నారు. ప్రస్తుతానికి అద్దె ఇంట్లో జీవనం సాగిస్తున్నారు. ప్రభుత్వ అధికారులు స్పందించి ఇంటి స్థలం పక్కా ఇళ్లు మంజూరు చేయవసిందిగా ఆ కుటుంబం విన్నవించుకుంటుంది. అదేవిధంగా ఈ గ్రామంలో త్రాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. గత పది సంవత్సరాల క్రితం ప్రభుత్వం వారు మంజూరు చేసినటువంటి పక్కా ఇల్లు  నిర్మించుకున్నారు. అవి నిర్మాణాలు జరిగినప్పుడు నాణ్యత లేకపోవడం వల్ల వర్షాలు కురిసినప్పుడు వర్షపు నీరు సీలింగ్ లో లీక్ అవుతూ ఇళ్ళల్లో నివసిస్తున్న నివాసితులు చాలా రకాలుగా సమస్యలు ఎదుర్కొంటున్నారు, సీసీ రోడ్లు కానీ, వీధి దీపాలు కానీ లేవు. కావున ప్రభుత్వ అధికారులు తక్షణమే పరిశీలించి గ్రామస్తులకు తగు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way