మదనపల్లెలో పన్నుల పేరిట పేద ప్రజల నుండి దోపిడి : చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత

    మదనపల్లె, (జనస్వరం) : పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు ఒక వైపు మరోవైపు పెంచిన ఆస్తిపన్ను నిత్యవసర వస్తువులు ధరలతో ప్రజల ఆర్థిక ఇబ్బందులు పడుతుంటే పుండుపై కారం చల్లినట్టు యూజర్ చార్జీలు(చెత్త పన్ను) మోగుతున్నాయి. ఇప్పటికే అనూహ్యంగా పెంచిన ఆస్తిపన్ను, నీటి పన్ను చెల్లించే ఆర్థిక స్తోమత లేని పేద ప్రజలు క్లాప్ పథకం అమలుపై పెదవి విరుస్తున్నారని అనిత అన్నారు. త్వరలోనే మదనపల్లి పురపాలక సంఘం పరిధిలో క్లీన్ ఆంధ్రప్రదేశ్ పథకం కింద చెత్త పన్ను వసూలు చేయడానికి 33 వాహనాలను సిద్ధం చేశారు. మదనపల్లి పురపాలక సంఘం పరిధిలో 35 వ వార్డులో అధికారుల లెక్కల ప్రకారం 30 వేల ఇళ్లు ఉన్నాయి. ఇందులో అధికారికంగా 1,35, 639 మంది జనాభా ఉండగా అనధికారికంగా 1.70 లక్షలు పైబడి ఉండొచ్చని అంచనా. ఇందులో 42 మురికివాడలు ఉండగా 60 వేల పైచిలుకు జనాభా ఉన్నారు. నివాస గృహాలు, నివాసేతర, వ్యాపార భవనాలు, మురికివాడలుగా పురపాలక సంఘం అధికారులు ఇప్పటికే నోటిఫై చేసారు. పురపాలక సంఘం చెత్తను తరలించడానికి వాహనాలు సిద్ధం చేసింది. ఏ క్షణంలో అయినా ఈ పథకాన్ని అమలు చేయవచ్చు. దీంతో నెలకు 60 రూపాయలు స్లమ్ కేటగిరి కి 30 రూపాయలు ధర నిర్ణయించగా దీన్ని సవరించి 100 రూపాయలు 50 రూపాయలు చేశారు. పెంచిన ధరలు పన్నులతో పేద ప్రజలు ఇప్పటికే ఇబ్బందులు పడుతుంటే తాజాగా ఈ చెత్త వేయడం చాలా అన్యాయమని వాపోయారు. నెలకు 35 లక్షలు వసూలు చేయడానికి పురపాలక సంఘం రంగం సిద్ధం చేయడం చాలా దుర్మార్గ కరమైన చర్య అని ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way