ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల పిల్లల చదువులకు పవన్ కళ్యాణ్ భరోసా : మంత్రాలయం జనసేన ఇంఛార్జ్ బి. లక్ష్మన్న

     మంత్రాలయం, (జనస్వరం) : అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించడమే కాకుండా వారి పిల్లల చదువులకు కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బరోసా ఇచ్చారని ఆ పార్టీ నియోజకవర్గ ఇంచార్జీ బి. లక్ష్మన్న తెలిపారు. శుక్రవారం స్థానిక రాఘవేంద్ర సర్కిల్ నాలుగు మండలాల నాయకులతో కలిసి రాజా మైలవరపు ఆధ్వర్యంలో రూపొందించిన టీం పిడికిలి గోడ పత్రికలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఆదాయం ఉన్న సినిమా రంగాన్ని వదలి ప్రజా సంక్షేమం కోసం పార్టీ స్థాపించారని కౌలు రైతులను ప్రభుత్వం విస్మరించిన నేపథ్యంలో సొంత డబ్బుతో ఒక్కొక్క కుటుంబానికి లక్ష రూపాయలు అందించి ఆదుకుంటున్నారని కొనియాడారు. వైసిపి పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా మూడేళ్లలో 3 వేల మంది కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని జిల్లాలో 373 మంది కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. ఇటీవల పవన్ కళ్యాణ్ పర్యటించి మృతి చెందిన కౌలు రైతు కుటుంబాలను పరామర్శించారని రానున్న రోజుల్లో మరిన్ని కుటుంబాలను కలవమన్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రాలయం మండల నాయకులు ఏసేబు, బిబిసి చిన్న, టిపి రఘు, కౌతాళం మండల నాయకులు రామాంజనేయులు, బసవరాజు, ఆంజనేయులు, పెద్దకడబూరు మండల నాయకులు గణేష్, రాజు, కోసిగి మండల నాయకులు వీరారెడ్డి, రాజు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way