తేజస్వినికి న్యాయం చేయాలని గోరంట్ల జనసేనపార్టీ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నిరసన

    గోరంట్ల, (జనస్వరం) : గత రెండు రోజుల క్రితం దారుణ హత్య కాబడిన బోయ తేజస్వినికి న్యాయం జరగాలి అని గోరంట్ల జనసేన పార్టీ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి నుంచి బస్టాండ్ వరకు భారీ ఎత్తున కొవ్వొత్తుల నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. అలాగే బస్టాండ్ ఆవరణలో రోడ్డుపై బైఠాయించి నిరసనలు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఘటన జరిగి 3 రోజులు కావొస్తున్న ప్రభుత్వం దీనిపై ఎందుకు స్పందించలేదు. రాష్ట్రంలో మహిళలపై రోజుకో అత్యాచారం జరుగుతున్న దిశా చట్టం ఎందుకు పనిచేయడం లేదని ప్రభుత్వంపై మండిపడ్డారు. అధికారులు ఇప్పటికి అయిన స్పందించి తేజస్విని కుటుంబానికి న్యాయం జరగాలని, ఈ విషయం గురించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిన్ననే ఈ ఘటన స్పందిస్తూ దోషులకు కఠిన శిక్షలు పడాలని అన్నారు. తేజస్వినికి న్యాయం జరిగే వరకు ఆ కుటుంబానికి జనసేన పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సురేష్, నాయకులు వెంకటేష్, గొల్ల అనిల్ కుమార్, సంతోష్, నాగేంద్ర, మల్లికార్జున, బాబావలి, బాలు, రమేష్, అనిల్, నరేంద్ర, ఆటో రాజేష్, రాజు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way