కర్నూలు – జనసేన పార్టీ రైతు భరోసా యాత్ర ప్రచార గోడ పత్రిక విడుదల

రైతు భరోసా యాత్ర

        కర్నూలు ( జనస్వరం ) :  పట్టణంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు భాస్కర్ ఆధ్వర్యంలో గురువారం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన రైతు భరోసా యాత్ర కు సంబంధించిన ప్రచార గోడ పత్రికలు విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు భాస్కర్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఆత్మహత్య చేసుకున్న 3000 మంది కౌలు రైతులకు అండగా నిలవడం కోసం రైతు భరోసా యాత్ర చేస్తూ, చనిపోయిన కౌలు రైతు కుటుంబ సభ్యులకు ఒక కుటుంబానికి లక్ష రూపాయల చొప్పున తన సొంత కష్టార్జితాన్ని పవన్ కళ్యాణ్ గారు ఇస్తున్నారు. గత నెలలో అనంతపురం జిల్లా అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో సహాయం అందించారని అత్యధికంగా కౌలు రైతులు ఆత్మహత్య జిల్లా ఉమ్మడి కర్నూలు జిల్లా అని ఈ నెల 8 ఆదివారం రోజున ఉమ్మడి కర్నూలు జిల్లా శిరివెళ్ళ మండలం లో రైతు భరోసా యాత్ర పవన్ కళ్యాణ్ గారు చేపట్టనున్నారని శిరివెళ్ల లో రచ్చబండ కార్యక్రమం చేపడుతున్నారు. పవన్ కళ్యాణ్ చనిపోయిన కౌలు రైతు కుటుంబ సభ్యులకు ఒక్కొక్క  కుటుంబానికి లక్ష రూపాయలు చొప్పున 130 కుటుంబాలకు ఆర్థిక సహాయం అందిస్తారని అన్నారు. గత ప్రభుత్వాల మాదిరే ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలను ఆదుకోవాల్సిన రాష్ట్రప్రభుత్వం వారిని పట్టించుకున్న పాపాన పోలేదని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఈ విషయం పైన స్పందించి విషయం తెలిసిందే. రాష్ట్రంలో కొన్ని చోట్ల మాత్రమే ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలకు డబ్బులు వేస్తున్నారని తక్షణమే రాష్ట్రవ్యాప్తంగా ఎంత మంది కౌలు రైతులు చనిపోయారో పూర్తి సమాచారం సేకరించి  అందరికీ సహాయం చేయాలని అన్నారు. రైతు ప్రభుత్వం అని చెప్పుకునే జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రైతులను విస్మరించడం తగదని 2024 లో రైతులకు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. అధికారం లేకపోయినా ప్రజల పక్షాన నిలబడే నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని అన్నారు. శిరివెళ్ల లో జరుగుతున్న రచ్చబండ కార్యక్రమం లో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అజిత్, పృద్వి, పెద్దయ్య, కాశీం, కిరణ్ రెడ్డి, కిషోర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way