
పాలకొండ, (జనస్వరం) : శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలంలో జనసేనపార్టీ నాయకులు గర్భాన సత్తిబాబు ఆధ్వర్యంలో వడమ గ్రామ జనసైనికులుతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పంట నష్టం వచ్చి చనిపోయిన కౌలు రైతులకు లక్ష రూపాయల చొప్పున 3000 మంది కౌలు రైతులకు 30 కోట్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారని జనసైనికులుకు తెలియచేస్తూ, ఈ కార్యక్రమాలు ప్రజలకు చేరువ అయ్యేలా జనసైనికులు భాద్యత తీసుకోవాలి అని తెలియచేయడం జరిగింది.