అగ్ని ప్రమాదంలో ఇల్లు కోల్పోయిన కుటుంబాలను ఆదుకున్న గుడివాడ జనసైనికులు

   గుడివాడ, (జనస్వరం) : కృష్ణాజిల్లా గుడివాడ పట్టణ స్థానిక ధనియాల పేట వార్డులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం జరిగి పూర్తిగా ఇల్లు కాలిపోవడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న గుడివాడ పట్టణ జనసైనికులు వారిని పరామర్శించి సహాయం చేయడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన నాయకులు మాచర్ల రామకృష్ణ (Rk) మాట్లాడుతూ ధనియాల పేటకు చెందిన రాము ఇల్లు అగ్నికి పూర్తిగా కాలిపోవడంతో సర్వం కోల్పోయి కట్టుబట్టలతో ప్రాణాలతో బయటపడ్డారు అని వారిని పరామర్శించి మా వంతు సహాయంగా వారికి మూడు నెలలకు సరిపడే బియ్యం కూరగాయలు నిత్యావసర సరుకులు అందజేయడం జరిగిందని తెలియజేశారు. అదేవిధంగా ఎన్నో సేవా సంస్థల వారు ఉన్నారని వారు కూడా కుటుంబ సభ్యులు పరిస్థితి చూసి వారినీ ఆదుకోవాలని కోరారు. ప్రభుత్వ అధికారులు హౌసింగ్ లోన్ ఇప్పించి ఇల్లు కట్టించాలని కోరారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఎక్కడ కష్టం వస్తే అక్కడ జనసైనికులు ఉంటారని తమ వంతు సహాయం చేసుకుంటూ ప్రజల్లో ఉంటారని తెలియజేశారు. అక్కడి స్థానికులు జనసేన సైనికులుని అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన ముస్లిం మైనార్టీ నాయకులు షేక్ కరిం, అయ్యప్ప, జగదీష్, చరణ్, పవన్, రామకృష్ణ, జనసైనికులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way