Search
Close this search box.
Search
Close this search box.

గ్రామాల్లో పర్యటిస్తున్న పిఠాపురం ఇంచార్జ్ మాకినీడి శేషుకుమారి

మాకినీడి శేషుకుమారి

           పిఠాపురం ( జనస్వరం ) : గోకివాడ గ్రామానికి పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ మాకినీడి శేషుకుమారి వెళ్లి అక్కడ ఉన్న గ్రామస్తులను కలిసి పర్యటించారు. ఆమె మాట్లాడుతూ అత్యధికంగా ఆదరించే గోకివాడ గ్రామ ప్రజలకు ఎప్పుడు రుణపడి ఉంటానని అన్నారు. ఇప్పుడున్న ప్రభుత్వ ప్రజల మీద భారం మోపి బాదుడే బాదుడు అంటూ కరెంటు బిల్లులు, ఆర్ టి సి రేట్లు పెంచి నిత్యావసర సరుకులు అత్యధికంగా పెంచారన్నారు. ఎన్నడూ లేనివిధంగా పెంచి ఇదంతా ప్రజలపై భారం మోపుతున్నారని వచ్చేది మనం ప్రభుత్వమే అని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ప్రజలకి అండగా ఉంటారని అన్నారు. అలాగే అధికారం లేకపోయినా ఆయన సొంత కష్టార్జితంతో 5 కోట్లు విరాళం, ఇప్పటం గ్రామ ప్రజలకు 50 లక్షలు ఇలాగే ఎన్నో ఇచ్చిన ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ అని చెప్పుకొచ్చారు. అలాగే పంట నష్టం భరించలేక ఆత్మహత్య చేసుకుని చనిపోయిన కౌలు రైతులకు ప్రతి కుటుంబానికి లక్ష రూపాయలు ఇప్పటికే బాధిత కుటుంబానికి అందజేశారని తెలియజేశారు. అలాగే గోకవాడ గ్రామంలో మెగా ఫ్యామిలీ వీర అభిమాని విశ్వనాథం సత్తిబాబు గారు, విశ్వనాథం సుబ్బారావుని మర్యాదపూర్వకంగా కలిశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way