కేతనకొండ గ్రామ జనసైనికులు ఆధ్వర్యంలో చలివేంద్రము ఏర్పాటు

     కేతనకొండ, (జనస్వరం) : ఇబ్రహీంపట్నం మండల కేతనకొండ గ్రామ జనసేన పార్టీ కార్యకర్తల ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేయటం జరిగింది. అలాగే రైతులకు జనసేన పార్టీ అధినాయకుడు శ్రీ కొణిదెల పవన్ కళ్యణ్ గారు కౌలు రైతులకు అండగా నిలిచి వారికి ఆర్ధిక సహకారం అందించటాన్ని హర్షిస్తూ కేతనకొండ రైతుల ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారి చిత్రపటానికి పాలాభిషేకం చెయ్యటం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అధితులుగా జనసేనపార్టీ మైలవరం నియోజకవర్గం ఇంచార్జి అక్కల రామ్మోహన్ రావు (గాంధీ), జనసేన నాయకులు అంజిబాబు, నాగబాబు, జిల్లా కార్యదర్శి శ్రీమతి చితల లక్ష్మి, ఇబ్రహీంపట్నం మండల జనసేన పార్టీ అధ్యక్షులు పోలిశెట్టి తేజ, ప్రవీణ్, చిట్టేలు కోటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ సామాజిక స్పూర్తితో ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన కేతనకొండ జనసేన పార్టీ నాయకులు కొమ్మూరు హనుమంతరావుకి, కొమ్మూరు వెంకట స్వామికి, అశోక్ కి, కేతనకొండ రైతులకు,  కేతనకొండ జనసేన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అభినందనలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way