లక్కవరపుకోట జనసేనపార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు

   లక్కవరపుకోట, (జనస్వరం) : మన భారత రత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మదిన వేడుకలను శృంగవరపుకోట నియోజకవర్గము, లక్కవరపుకోట మండలంలో జనసేన నాయకులు వబ్బిన సత్యనారాయణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా బహుజన సమజ్వాజ్ పార్టీ ఈశ్వరరావు, సెర్చ్ కమిటీ సభ్యులు రామెల్ల శివాజీ  మాట్లాడుతూ అంబేద్కర్ లాంటి మహనీయుల భావజాలం, ఆశయాలను ప్రతీ పౌరుడు మార్గదర్శకంగా తీసుకుని నవసమాజ, సమసమాజ నిర్మాణానికి పాటుపడాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వబ్బిన సత్యనారాయణ కోట సెంటర్లో గల విగ్రహానికి ఇనుప నిచ్చెన నిర్మిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అలాగే నియోజకవర్గ నాయకులు పెడిరెడ్ల రాజశేఖర్ కూడా sc. కాలనీలో గల అంబేద్కర్ విగ్రహం కార్యక్రమంలో విగ్రహానికి ఇనుప నిచ్చెన బహుకరిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో దళిత నాయకులు సూరి దేముడు, అప్పారావు, గానివడ అప్పారావు,  జనసేన నాయకులు జొన్నపల్లి సత్తిబాబు, రాంబాబు, మధు, చంటి నక్కరాజు సతీష్, గాలి అప్పారావు, వీరమహిళ వెంకట లక్ష్మి పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way