కొత్తపేట, (జనస్వరం) : తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలం చింతలూరు గ్రామానికి చెందిన శెట్టిబలిజ సామాజిక వర్గ వైఎస్సార్సీపీ కార్యకర్తలు పిల్లి శంకర్, గుత్తుల శ్రీనివాస్, కడలి మణికంఠ, అడ్డల వినయ్ కుమార్ చింతలూరు పార్టీ ప్రెసిడెంట్ దేశబత్తుల సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీ కొత్తపేట నియోజకవర్గ ఇంచార్జ్ బండారు శ్రీనివాస్ గారి సమక్షంలో జనసేన పార్టీ ఆశయాలు, సిద్ధాంతాలు నచ్చి జనసేన పార్టీలోకి చేరడం జరిగింది. వారందరికి శ్రీనివాస్ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.