Search
Close this search box.
Search
Close this search box.

వృద్ధులకు సకాలంలో పింఛన్లు అందజేయాలి : శింగనమల మండల జనసేన నాయకులు

    శింగనమల, (జనస్వరం) : అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం, శింగనమల మండలంలోని వివిధ గ్రామాల్లో నేటికీ వృద్ధాప్య పెన్షన్లు అందలేదు. పెన్షన్లు సక్రమంగా సకాలంలో అందక గ్రామాల్లోని పెన్షన్ దారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యపై స్పందిస్తూ జనసేనపార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శి బొమ్మన పురుషోత్తమ రెడ్డి, మండల అధ్యక్షుడు తోట ఓబులేసు మాట్లాడుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వం పింఛన్లు ఒకటో తారీఖున సకాలంలో పంపిణీ చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటుంది కానీ, నేటికీ కూడా పెన్షన్ ఇవ్వకుండా వృద్ధులుకు, వితంతువులకు, వికలాంగులకు పండగ పూట కూడా ఫించన్లు ఇవ్వక వారికి తీరని అన్యాయం చేస్తోందని వారికి కనీసం పెన్షన్లు ఎందుకు ఇవ్వలేదో కూడా అధికారులు తెలియజేయలేక పోతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఒకటి రెండు రోజుల్లో పెన్షన్ దారులకు పెన్షన్ ఇవ్వాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తోట ప్రవీణ్, సాయి శంకర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way