చిత్తూరులో జనసేనపార్టీ ఆధ్వర్యంలో వైద్య శిబిరం ఏర్పాటు

             చిత్తూరు ( జనస్వరం ) : చిత్తూరు నియోజకవర్గ జిల్లా కార్యదర్శి దేవినేని యశ్వంత్, పూలు చందు, మురళి, సంతోష్ మరియు వెంకటేష్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. చిత్తూరు జిల్లా జనసేనపార్టీ అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరి ప్రసాద్ ముఖ్య అతిథిగా విచ్చేసి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం బెంగళూరులోని ప్రముఖ వైదేహి ఆసుపత్రి వారి సహకారంతో అన్ని విభాగాల నుండి పదిమంది డాక్టర్లతో తీసుకురావడం కోసం హాస్పిటల్ PROD పుంగనూరు నానబాలు లోకేష్  సహకరించారు. సుమారుగా 100 మంది ప్రజలకు షుగర్, బిపి, ఈసీజీ, X-ray, cancer tests, గుండె పరీక్షలు కీళ్ల నొప్పులు తదితర వ్యాధులకు పరీక్షలు నిర్వహించారు. ఇలాంటి కార్యక్రమాలను ప్రతి వార్డు లో నెలకు ఒకసారి జరపాలని జిల్లా అధ్యక్షులు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ఆకేపాటి సుభాషిని, జిల్లా ప్రధాన కార్యదర్శి తులసి ప్రసాద్, జిల్లా కార్యదర్శి భాను, యువ నాయకులు పార్ధు మరియు జనసైనికులు వీర మహిళలు పాల్గొన్నారు