శ్రీకాకుళం జిల్లా : పెరిగిన విద్యుత్ చార్జీలపై జనసేన పోరాటం

విద్యుత్

          శ్రీకాకుళం ( జనస్వరం ) : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలను నిరసిస్తూ జనసేనపార్టీ అద్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు శుక్రవారం శ్రీకాకుళం జిల్లా జనసేన పార్టీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టి, పెంచిన విద్యుత్ ఛార్జీలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. శ్రీకాకుళం జనసేన నాయకులతో కలిసి కలెక్టర్ కు వినతి పత్రాలు అందచేసిన జనసేన నాయకులు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రస్తుత ముఖ్యమంత్రి పాదయాత్ర సమయంలో అప్పటి ప్రభుత్వంను విద్యుత్ చార్జీలను, పెంచారని వైసిపి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పి, ఇప్పుడు ఇష్టానుసారంగా పెంచి, పేదలకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. గడిచిన కాలంలో ఈ రెండు పార్టీల పరిపాలనలో విసుగు చెందిన ప్రజలకు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మాత్రమే న్యాయం చేయగలరని ధీమా వ్యక్తం చేశారు. అలాగే పెంచిన విద్యుత్ చార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు, లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way