భాగంపల్లి గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ జనసేనపార్టీలోకి చేరిక

భాగంపల్లి

            కడప ( జనస్వరం ) :  కడపజిల్లా రాజంపేట నియోజకవర్గ పరిధిలోని టి. సుండుపల్లి మండలం, భాగంపల్లి గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ రాము నాయక్ అలాగే ఆయన వర్గంతో పాటుగా పలువురు కృష్ణా నాయక్, మున్నా నాయక్, శ్రీనివాస్ నాయక్, రాజు నాయక్ తదితరులు జనసేనపార్టీలోకి చేరారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆశయ సిద్దాంతాలకు ఆకర్షితులై జనసేన నాయకులు  రామశ్రీనివాసులు సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. రామశ్రీనివాసులు మాట్లాడుతూ రాష్ట్రంలో జనసేనపార్టీ పుంజుకుంటోందని అన్నారు. వైసీపీ ప్రభుత్వం చేసే అరాచక పాలనకు ప్రజలు విసుగు చెందుతున్నారన్నారు. కొత్తగా పార్టీలోకి చేరిన వారిని జనసేన పార్టీ సిద్దాంతాలను, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు. 

See also  పాలకులకు ప్రజల సమస్యలు కనిపించడం లేదా? ఎమ్మిగనూరు జనసేన నాయకులు