కృష్ణాజిల్లా జనసేనపార్టీ అధికార ప్రతినిధిగా ఎన్నికైన సయ్యద్ అబ్దుల్ నజీబ్

     కృష్ణా, (జనస్వరం) : ముస్లిం మైనార్టీలకు రాజకీయంగా ప్రతిభను ప్రామాణికంగా తీసుకుని ప్రాధాన్యత కల్పిస్తూ బాధ్యతలు అప్పగించే కొత్త తరం రాజకీయ శకానికి నాంది పలుకుతున్న జనసేనపార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కృష్ణాజిల్లా జనసేనపార్టీ అధికార ప్రతినిధిగా సయ్యద్ అబ్దుల్ నజీబ్ ను నియమించడం జరిగింది. ఈ సందర్భంగా విజయవాడ నగర జనసేన నాయకులు నజీబ్ ను శాలువతో సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి నమ్మకాన్ని వమ్ము కలిగించకుండా ఆయన మహోన్నతమైన ఆశయాలను, జనసేనపార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా జనసేనపార్టీ తరఫున తన బలమైన వాణిని వినిపిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో విజయవాడ నగర అధ్యక్షులు పోతిన వెంకట మహేష్, కమల్ల సోమునాధం విజయవాడ నగర ఉపాధ్యక్షులు, విజయవాడ నగర కమిటీ నంబర్స్ అబ్దుల్ అలియాబేగం, పాల రజిని, కుప్పాల శ్రీనివాస్, విజయవాడ సెంట్రల్ 60th డివిజన్ ప్రెసిడెంట్, జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way