హిందూ ధార్మిక కార్యక్రమాలు చేస్తున్న జనసేన నాయకులు

     ములకలచేరువు, (జనస్వరం) : మన సనాతన హిందూ ధర్మాలను జానపద గేయ భజనల రూపంలో తరువాతి తరం వాళ్లకు అందిస్తూ ఎన్నో భజన బృందాలను ఏర్పాటు చేసి, తిరుమల కొండ మీద భజనలు చేయిస్తున్నది మన జానపద కళాకారుల సంఘం. అన్నమాచార్యుల వారి వారసులు ఈ సంఘంలోని కళాకారులని సన్మానించే కార్యక్రమం మండల వారిగా చేపడుతున్నారు. పెద్దపాళ్యం ఆంజనేయస్వామి ఆలయంలో సంఘం అధ్యక్షులు జగన్మోహన్ రావు గారి ఆధ్వర్యంలో ములకలచేరువు మండల భజన బృందాల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. హిందూ ధర్మానికి మన వంతు సహాయం చేయడానికి, పెద్దపాళ్యం కామాక్షి అంజి గారి ఆలోచనతో, ములకలచేరువు మండల జనసేన అధ్యక్షులు సాయినాథ్ గారి ఆధ్వర్యంలో భజన బృందాలకు మజ్జిగ ప్యాకెట్ల వితరణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల జనసేన ప్రధాన కార్యదర్శులు కిరణ్ రాయపు, సుదర్శన్, సురేష్, శ్రీధర్, నరేష్, అమర, రామాంజులు, సుబ్బరామ్, ప్రభాకర్ నాగరాజు, జనసేన కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way