ముదినేపల్లి మండలంలో క్రియాశీలక సభ్యత్వం పై అవగాహన కల్పించిన జనసేన నాయకులు వీరంకి వెంకయ్య

    ముదినేపల్లి, (జనస్వరం) : కృష్ణా జిల్లా కైకలూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా మంగళవారం వనుదుర్రు గ్రామంలో జనసేన పార్టీ ముదినేపల్లి మండల అధ్యక్షులు వీరంకి వెంకయ్య క్రియాశీలక సభ్యత్వముపై కార్యకర్తలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా ఇంతవరకు కార్యకర్తల సంక్షేమం కోసం ఆలోచించలేదని, కేవలం జనసేన పార్టీకి మాత్రమే చెల్లిందని, ఈ అవకాశాన్ని ప్రతీఒక్క కార్యకర్త వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న వాళ్లకి అనుకోకుండా ఎటువంటి ప్రమాదం అయినా జరిగితే వైద్య ఖర్చుల నిమిత్తం 50 వేలు, మరణించినట్లయితే వారి కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లా సంయుక్త కార్యదర్శి వేల్పూరి నానాజీ, జనసేన నాయకులు, వెంట్రపాటి వెంకన్న, అంబుల భరత్, మాట్లపుది మధన, సుడాబత్తుల సాయీష్, వాలిశెట్టి బాబీ, బోయిన వాసు, పొన్నాముది ఫణికుమార్, బోయిన దుర్గా రావు, జంగం కొండలరావు, జనసైనికులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way