జనసేనపార్టీ క్రియాశీలక సభ్యత్వం అందరు నమోదు చేసుకోవాలి : మండపేట నియోజకవర్గ ఇంఛార్జ్ వేగుళ్ళ లీలాకృష్ణ

     మండపేట, (జనస్వరం) : సమాజంలో నవ చైతన్యం, మార్పు తెచ్చే దిశగా భవిష్యత్లో జనసేన పార్టీ ఉప్పెనలా ఎగసిపడుతుందని మండపేట నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ వేగుళ్ళ లీలాకృష్ణ పేర్కొన్నారు. ఈ నెల 7తో పార్టీ క్రియాశీలక సభ్యత్వం నమోదు గడువు ముగుస్తుందని ఆయన అన్నారు. పార్టీని నమ్ముకున్న వారికి అండగా నిలిచే సత్తా ఒక్క జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే ఉందని స్పష్టం చేశారు. ఈ నెల 7 న పార్టీ సభ్యత్వాల నమోదు గడువు ముగుస్తున్న నేపథ్యంలో పార్టీ శ్రేణులు, పవన్ అభిమానులు, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జనసేన పార్టీలో సభ్యత్వం తీసుకున్న వారిలో ఎవరైనా దురదృష్టవశాత్తు ప్రమాదాలలో మృతి చెందితే పార్టీ తరుపున వారికి రూ 5 లక్షల సహాయం అందిస్తారని పేర్కొన్నారు. ఒకవేళ ప్రమాదాలలో ఎవరైనా గాయపడితే రూ 50 వేల రూపాయల వరకు ఆర్ధిక సహాయం అందుతుందన్నారు. ఇప్పటికే పలువురు జనసైనికులకు ఇదే విధంగా పలు ఆర్ధిక సహాయలు అందయన్నారు. 18 సంవత్సరాలు నుండి 70 ఏళ్ళ లోపు వయస్సు వారంతా ఈ సభ్యత్వ నమోదు పథకాన్ని వినియోగించుకోవాలని కోరారు. మండపేట నియోజకవర్గంలో క్రియాశీలక సభ్యత్వం పూర్తి వివరాలకు 9441857117 నెంబర్ కు ఫోన్ చేసి సంప్రదించాలని ఆయన కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way