కొండాపురం మండలంలో క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమాన్ని ప్రారంభించిన జనసేన నాయకులు

   ఉదయగిరి, (జనస్వరం) : జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం నమోదు కార్యక్రమంలో భాగంగా ఉదయగిరి నియోజకవర్గం కొండాపురం మండలం కొమ్మి పంచాయతీ రామానుజపురం గ్రామంలో మండల అధ్యక్షులు ఆకుల వెంకట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనసేన పార్టీలో సభ్యత్వం తీసుకున్న వారిలో ఎవరైనా దురదృష్టవశాత్తు ప్రమాదాలలో మృతి చెందితే పార్టీ తరుపున వారికి 5 లక్షల రూపాయల సహాయం అందించడం జరుగుతుందన్నారు. అదే విధంగా ప్రమాదాలలో ఎవరైనా గాయపడితే 50 వేల రూపాయల వరకు ఆర్ధిక సహాయం అందుతుందన్నారు. ఇప్పటికే పలువురు జనసైనికులకు ఇదే విధంగా పలు ఆర్ధిక సహాయలు అందించడం జరిగిందన్నారు. 18 సంవత్సరాలు నుండి 70 ఏళ్ళ లోపు వయస్సు వారంతా ఈ సభ్యత్వ నమోదు పథకాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆకుల సాయి, దాసరి రమేష్, బత్తల అఖిల్, నల్లబోతుల మనోహర్, బొడుగు మహేంద్ర తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way