అనారోగ్యంతో మృతి చెందిన జనసైనికుడి కుటుంబాన్ని పరామర్శించిన గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు

   గురజాల, (జనస్వరం) : గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గం పల్లెగుంత గ్రామ జనసైనికుడు దీకొండ వేణు అనారోగ్య కారణాలతో మృతి చెందారు. ఆయన దినకర్మ కార్యక్రమంలో పాల్గొని నివాళులు ఆర్పించి, కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేణు కుటుంబానికి పవన్ కళ్యాణ్, రాష్ట్ర పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. పార్టీ కోసం అహర్నిశలు కష్టపడే  వేణుని కోల్పోవడం పార్టీకి తీరని లోటని ఆయన స్థానాన్ని ఎవరు భర్తీచేయలేరని అన్నారు. అలాగే జనసేన పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకి, జనసైనికుడికి పార్టీ అండగా ఉంటుందని జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు అన్నారు. ఈ కార్యక్రమంలో గురజాల మండల అధ్యక్షులు ఉప్పిడి నరసింహారావు, పిడుగురాళ్ల అధ్యక్షులు కామిశెట్టి రమేష్, దాచేపల్లి అధ్యక్షులు మందపాటి దుర్గారావు, మాచవరం అధ్యక్షులు బొమ్మా శ్రీనివాసరావు, రాజుపాలెం అధ్యక్షులు తోట నర్సయ్య, గురజాల చిరంజీవి యువత అధ్యక్షులు ఎర్నాని రామకృష్ణ, బావన్నారాయణ తవిటి, మణికంఠ, బడిదెల శ్రీనివాసరావు, బయ్యవరపు రమేష్, బుక్కీశెట్టి శివ, మల్లెల రామంజి, సాయి, పూర్ణ, తమ్మిశెట్టి మహేశ్, అతిలేశ్ కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way