క్యాన్సర్ వ్యాధితో మరణించిన బాబురావు కుటుంబానికి ఆర్థికసాయం అందించిన జనసేన నాయకులు

జనసేన

          శ్రీకాకుళం ( జనస్వరం ) : నియోజకవర్గంలోని స్ధానిక దమ్మల వీదిలో నివాసముంటున్న బాబురావు అనే యువకుడు ఈ మధ్యనే క్యాన్సర్ వ్యాధితో మరణించారు. వృత్తిరీత్యా డ్రైవర్ అయిన బాబురావు కుటుంబ ఆర్థిక పరిస్థితి తెలుసుకుని వారికి అండగా ఉండాలనే ఉద్దేశ్యంతో 39వ వార్డు లోని జనసేన నాయకులు కామేష్ మరియు తేజ విషయాన్ని ఆస్ట్రేలియాలోని జనసేన నాయకులు సనపల సంజయ్ కు తెలియచేసారు. ఆయన వెంటనే స్పందించి తక్షణ సహాయంగా 15వేల రూపాయలును ఆ కుటుంబానికి ఆర్థిక సహయంగా పంపించారు. శ్రీకాకుళం జనసేన పార్టి నాయకులు ఉదయ్ మరియు గురు ప్రసాద్ అధ్వర్యంలో బాబురావు కుటుంబ సభ్యులకు 15 వేలు రూపాయలకు అందించారు. కష్ట సమయంలో తమ కుటుంబానికి అండగా నిలిచినందుకు బాబురావు భార్య జనసేన పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలియచేశారు. కార్యక్రమంలో జనసేన నాయకులు ప్రవీణ్, నవీన్, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way