అమలాపురం వద్దు – రాజమహేంద్రవరం ముద్దు : జనసేన నాయకులు వేగుళ్ళ రాజబాబు

   మండపేట, (జనస్వరం) : మండపేట ప్రజలు కోరుకునే రీతిలో రాజమహేంద్రవరం కేంద్రంగా ఏర్పడే తూర్పుగోదావరి జిల్లాలోనే మండపేటను విలీనం చేయాలని జనసేన నాయకులు వేగుళ్ళ రాజబాబు డిమాండ్ చేశారు. జె.ఏ.సి ఆధ్వర్యంలో మండపేట పురపాలక సంఘం కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన జె.ఏ.సి దీక్ష శిబిరాన్ని గురువారం ఆయన సందర్శించి సంపూర్ణ మద్దతు తెలిపారు. అనంతరం విద్యార్థులు చేపట్టిన మహార్యాలీలో ఆయన పాల్గొని, ఎం.ర్.ఓ గారికి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని రాజకీయ పక్షాలు ఏకమై జె.ఏ.సి గా ఏర్పడి వినతులు ద్వారా కార్యక్రమలు చేపట్టడం అభినందనీయమని పేర్కొన్నారు. రాజమహేంద్రవరంలో మండపేట కలిస్తే కలిగే ప్రయోజనాలు వివరించారు. మండపేట ప్రజల సౌకర్యాలను పరిగణంలోకి తీసుకోని ప్రజల ఆకాంక్షను ప్రతిబింబిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కోరారు. జె.ఏ.సి కి జనసేనపార్టీ తరుపున ఎల్లప్పుడూ మా సంపూర్ణ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీ నాయకులు, కుల సంఘాలు, విద్యార్థులు మరియు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way