వీఆర్ఏల ధర్నాకు సంపూర్ణ మద్దతు ప్రకటించిన సుండుపల్లి జనసేన నాయకులు

    సుండుపల్లి, (జనస్వరం) : గత పది రోజులుగా కొనసాగుతున్న వీఆర్ఏల ధర్నాకు సంపూర్ణ మద్దతుగా జనసేన ఆధ్వర్యంలో సుండుపల్లి మండల తహశీల్దార్  శ్రీలత గారికి వినతిపత్రాన్ని ఇవ్వడం జరిగింది. ఏడు న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ సుండుపల్లి తహసీల్దార్ ఆఫీస్ వద్ద వీఆర్ఏలు ధర్నా 10వ రోజు కొనసాగుతుండగా జనసేనపార్టీ తరపున సంఘిభావం తెలిపారు. జనసేనపార్టీ నాయకులు రామ శ్రీనివాసులు మాట్లాడుతూ విఆర్ఎలకు 21000 రూపాయలు వేతన ఇవ్వాలని ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన డిఎ రికవరీ ఉత్తర్వులు ఉపసంహరించాలి. డిఎతో కూడిన వేతనం ఇవ్వాలని, నామినీలుగా పనిచేస్తున్న వారందరినీ విఆర్ఎలుగా నియమించి ఆ కుటుంబాలకు న్యాయం చెయ్యాలన్నారు. అర్హులందరికీ ప్రమోషన్లు ఇవ్వాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలన్ని విఆర్ఎలకు వర్తింప చెయ్యాలన్నారు. గత 10 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సీఐటీయూ జిందాబాద్ అని నినాదాలు చేస్తూ ధర్నా ఉద్యమించారు. ఈ కార్యక్రమంలో మండల జనసేనపార్టీ వీర మహిళ రెడ్డిరాని, జనసేనపార్టీ నాయకులు రామశ్రీనివాసులు, ఓబులేసు, చెన్నకృష్ణ, శ్రీరాములు అలానే మండల వి.ఆర్.ఏలు అల్లబకాశ్, నాగరాజ రమణ, శంకరయ్య, లలితమ్మ, జగన్నాథం, అల్లావుద్దీన్, అన్వర్, శివ, జయరామయ్య, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way