జనగామ సంఘటన తీవ్రంగా కలిచి వేసింది : జనసేన నాయకులు బైరి వంశీ కృష్ణ

    హనుమకొండ, (జనస్వరం) : ఉమ్మడి వరంగల్ జిల్లాలో భాగమైన జనగామ నియోజకవర్గంలో గత రెండు రోజులుగా అధికార ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలు, నాయకులు వ్యవహరించిన తీరు తీవ్రంగా కలిచి వేసింది అని జనసేన పార్టీ గ్రేటర్ వరంగల్ అధ్యక్షులు బైరి వంశీ కృష్ణ అన్నారు. ఒకవైపు జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు యువతకి మంచి రాజకీయ భవిష్యత్ ఇవ్వాలని జనసేన పార్టీని స్థాపించి మంచి మార్గంలో నడిపిస్తుంటే మిగతా పార్టీ నాయకులు యువతకి రాడ్లు, కర్రలు ఇచ్చి రోడ్డు మీదకు ఎక్కి తలలు పగలుకొట్టుకునే రాజకీయం నేర్పిస్తున్నారు. నీతిమాలిన రాజకీయాలు చేస్తూ కేవలం నాయకుల రాజకీయ లబ్దికోసం యువత జీవితాలను నాశనం చేస్తున్నారు. యువతని రాజకీయ లబ్దికోసం వాడుకుంటూ కేవలం ఓటు బ్యాంకుగా చూస్తున్న ఈ నాయకులకు రాబోయే రోజుల్లో తగిన బుద్ది చెప్తారని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way