దాతల సహకారంతో అనాధ పిల్లలకు బ్రహ్మాస్త్రం కిట్లు అందజేత

     విశాఖపట్నం ( జనస్వరం ) : గాజువాకలో డిజర్ సొసైటీ అనాధ ఆశ్రమం పిల్లలకు బ్రహ్మస్త్రం నాగు దాతల సహాకారంతో 20 మంది అనాధలకు కిట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కిట్లులో 20 రకాల నిత్యావసర సరుకులు ఉన్నాయి. బ్రహ్మాస్త్రం నాగు మాట్లాడుతూ గాజువాకలో ఉన్న అన్ని అనాధ ఆశ్రమాలకు బ్రహ్మస్త్రం కిట్లు ఇవ్వాలి అనే ధృడ సంకల్పంతో ముందుకు వెళుతున్నామన్నారు. నేటికి ఈ 20 మంది అనాధ పిల్లలతో కలిసి 188 మంది అనాధ పిల్లలకు మన గాజువాకలో ఉన్న అనాధ ఆశ్రమాలకు నేరుగా స్వయంగా వెళ్లి నేనే ప్రతి ఒక్క అనాధ పిల్లాడికి అందించడం జరిగిందన్నారు. అయితే ముందుగా గాజువాకలో ఉన్న అన్ని అనాధ ఆశ్రమాలకు బ్రహ్మస్త్రం కిట్లు చేరవేసిన తరువాత వేరే నియోజకవర్గాలలో అనాధ పిల్లలకు బ్రహ్మస్త్రం కిట్లు మా బ్రహ్మస్త్రం టీం ద్వారా ఇవ్వడం జరుగుతుందన్నారు. మన గాజువాకలో నిస్సి ఆశ్రమం 53 మంది అనాధ పిల్లలకు స్ఫూర్తి అనాధ ఆశ్రమం 60 మంది పిల్లలకు జనరేషన్ యువ 50 మంది అనాధ పిల్లలకు నేడు డిజర్ సొసైటీ 20 మంది అనాధ పిల్లలకు ఇలా మరో 5 మంది పేదవారికి కిట్లు ఇచ్చామన్నారు. ఈ కార్యక్రమం అంతా దాతల సహాకారంతో చేస్తున్నామని సహాయం అందించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way