ఉరవకొండ జనసేనపార్టీ నాయకులు ఆత్మీయ సమావేశం

     ఉరవకొండ, (జనస్వరం) : అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం పరిధిలోని నియోజకవర్గ కేంద్ర స్థాన మండలం ఐన ఉరవకొండ మండలం జనసేన పార్టీ ఆత్మీయ సమావేశంలో ఉరవకొండ మండల అధ్యక్షుడు బోయ చంద్రశేఖర్ గారి అధ్యక్షతన మండల కమిటీ ఏర్పాటు మరియు జనసేన పార్టీ బలోపేతం గురించి చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా కార్యదర్శి గౌతమ్ కుమార్ మాట్లాడుతూ శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు అనుగుణంగా నిస్వార్థంగా కష్టపడే నిస్వార్థ జనసైనికులకు పార్టీ కార్యవర్గ కమిటీలో పెద్దపీట వేయడం జరుగుతుంది. పార్టీ ముఖ్య సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లేలా రాబోయే రోజుల్లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో విజయ ఢంకా మోగించేలా పని చేస్తామని తెలిపారు. రాబోయే 2024 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ విజయం సాధించడానికి అహర్నిశలు పాటుపడాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఉరవకొండ నియోజకవర్గం నాయకులు మల్లేష్ గౌడ్, బోయ దేవేంద్ర, నాగిరెడ్డి, మండల కమిటీలోని ఉపాధ్యక్షులు అబ్దుల్లా, హెగ్డే గుడిసెల రాజేష్, ప్రధాన కార్యదర్శులు, మల్లికార్జున, మంగలి వెంకీ, తిలక్, ఓబులేసు మరియు కమిటీ సభ్యులులతో పాటు పలువురు నాయకులు, జనసైనికులు, అభిమానులు పాల్గొన్నారు.