విజయవాడ 38 వ డివిజన్ జనసేనపార్టీ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు

    విజయవాడ, (జనస్వరం) : 73 వ గణతంత్ర దినోత్సవ వేడుకలను విజయవాడ జనసేన పార్టీ నగర రథసారధి పశ్చిమ నియోజకవర్గ ఇంఛార్జ్ పోతిన వెంకట మహేష్ గారి ఆదేశానుసారం జనసేన పార్టీ 38వ డివిజన్ అధ్యక్షులు తమ్మిన లీలా కరుణాకర్ గారి ఆధ్వర్యంలో కుమ్మరిపాలెం సెంటర్ వద్ద ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులుకు పుస్తకాలు, పెన్నులు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమాని ఉద్దేశించి లీలా గారు మాట్లాడుతూ ఎంతోమంది త్యాగమూర్తుల స్ఫూర్తి మన భారతదేశం, రాజ్యాంగం ద్వారా సంపూర్ణ స్వేచ్ఛ కలిగింది. భారతీయులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నగర కమిటీ గన్ను శంకర్, స్టాలిన్, శనివారపు శివ, 39 వ డివిజన్ అధ్యక్షులు ఏలూరు శరత్, 52 వ డివిజన్ అధ్యక్షులు కనక, 38 డివిజన్ కమిటీ దారా రాంబాబు రామకృష్ణ, కోటి, దిలీప్, చంద్రశేఖర్, సూర్య, జనసేన నాయకులు పాల్గొనడం జరిగింది.

See also  నూజివీడు జనసేనపార్టీ ఆధ్వర్యంలో రంజాన్ వేడుకలు