విలేఖరుల మిత్రులతో పెనుకొండ జనసేన నాయకులు ఆత్మీయ సమావేశం

పెనుకొండ

     పెనుకొండ, (జనస్వరం) : అనంతపురం జిల్లా పెనుగొండ నియోజకవర్గం పరిగి మండలంలో జిల్లా సంయుక్త కార్యదర్శి మోద శివ గారి ఆధ్వర్యంలో పరిగి మండల విలేఖరుల మిత్రులతో జనసేన నాయకులు ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా పరిగి ఎస్ఐ శ్రీ శ్రీనివాసులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ సమాజంలో అందరి కంటే ముందు ఉండి ఏ సమయంలోనైనా ఎక్కడికైన చురుగ్గా వెళ్లి విషయం సేకరిస్తూ సమాజానికి అందించేది విలేకరులు అని తెలిపారు. జర్నలిస్ట్ శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ జనసేన పార్టీ సేవా కార్యక్రమాలు చేసిన ప్రజా సమస్యలపై పోరాడిన దాన్ని మేము తప్పకుండా సమాజానికి తెలియజేస్తామని తెలిపారు. ఎంతో మంది యువత ఇక్కడకు వచ్చారు అని మంచి నాయకుడిగా ఎదగాలని పెద్దవాళ్లు సలహాలతో రాబోయే రోజుల్లో నాయకులుగా మీరు ఎదగాలని అన్నారు. జర్నలిస్టుల సమస్యలపై తెలియజేస్తూ మేము పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కాదు మా కష్టాలు ఎవరికీ చెప్పలేకపోతున్నామని, సరైన జీతాలు లేక కుటుంబంలో పడుతున్న కష్టాలు ఎవరికి తెలియజేయలేకపోతున్నామనిన్నారు. ఈ కార్యక్రమములో ఎస్ఐ శ్రీనివాసులు చేతులు మీదుగా పరిగి మండలం విలేఖర్లకు జెర్కీ లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పరిగి మండల కన్వీనర్ సురేష్, నారాయణస్వామి, మధు, రమేష్, అశ్విత, శివ శంకర్, హనుమంతు, నాగేష్, మహేష్, ఆనంద్, విజయ్, మైలార్ప్ప, పాపన్న, నరసింహ మూర్తి, నారాయణ, మిట్టపల్లి రవి, అంజప్ప, అశోక్, నవీన్, చరోపల్లి శ్రీ రామ్, జేబీ తేజ, ఈశ్వర్ తదితురులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way