కుళాయి మరమ్మతులు చేపట్టి గిరిజనులకు మంచినీరు అందించాలి : అరకు జనసేన నాయకులు సాయిబాబా

 అరకు, (జనస్వరం) : విశాఖ మన్యం అరకు నియోజకవర్గం అనంతగిరి మండలం, కొండిబ పంచాయితీ పరిధిలో గలమువ్వం గూడ గ్రామాల్లో శనివారం ఉదయం జనసేన బృందం ఆధ్వర్యంలో గ్రామంలో పర్యటించడం జరిగింది. పర్యటనలో భాగంగా గ్రామస్తులతో సమావేశమై సమస్యల పట్ల చర్చించడం జరిగింది. ముఖ్యంగా ఆయా గ్రామంలో కుళాయి మరమత్తు అవడం వలన మంచినీటి కోసం తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నట్లు జనసేన పార్టీ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా సాయిబాబా, దురియా, సన్యాసి రావు తదితరులు మాట్లాడుతూ ముందుగా జనసేన మాటలు జనంలోకి తీసుకెళ్లారు. అనంతరం మువ్వంగూడ గ్రామంలో కుళాయి మరమ్మతులు ఉన్నప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం చాలా విడ్డూరంగా ఉందని, తక్షణమే ప్రభుత్వ సంబంధిత అధికారులు చొరవ తీసుకొని కుళాయి మరమ్మతులు చేపట్టి గిరిజనులకు మంచినీరు అందించగలరని ఈ సందర్భంగా ప్రభుత్వానికి జనసేన పార్టీ తరుపున డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వైయస్సార్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నేల నుండి ఆకాశం అందే వరకు నిత్యావసర సరుకులు విపరీతంగా పెరిగాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కావున రానున్న రోజుల్లో వైయస్సార్ పార్టీకి బుద్ధి చెప్పాలని, రానున్న రోజుల్లో జనసేన పార్టీని ఆదరించాలని గిరిజనులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు నర్సింగ్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way