రోడ్డు ప్రమాదంలో మరణించిన జనసైనికుడి కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన గురజాల జనసేన నాయకులు

గురజాల

   గురుజాల, (జనస్వరం) : ఇటీవల రోడ్డు ప్రమాదంలో గురజాల పట్టణానికి చెందిన అన్వర్ మరణించిడం జరిగింది. వారి కుటుంబ పరిస్థితిని తెలుసుకుని జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఆ కుటుంబానికి పదివేల రూపాయల ఆర్థిక సహాయంతో పాటు నెలకు సరిపడా నిత్యావసర సరుకులు జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి కటికం అంకారావు, జనసేన నాయకులు ప్రసాద్, అజీస్, కళ్యాణ్ చేతుల మీదగా అందజేశారు. ఈ సందర్భంగా అంకారావు మాట్లాడుతూ ఇంట్లో పెద్ద వ్యక్తులు రోడ్డు ప్రమాదంలో మరణిస్తే ఆ కుటుంబం పడే బాధ మాటల్లో చెప్పలేమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వారి కుటుంబానికి అండగా ఉండాలనే ఉద్దేశంతో, మానవతా దృక్పథంతో ఆర్థిక సహాయం అందజేయడం జరిగిందని ఆయన తెలిపారు. పార్టీలకతీతంగా అందరూ వారి కుటుంబాన్ని ఆదుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సామాజిక సేవ చేయడం మా బాధ్యత అని, దానికి స్ఫూర్తి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు అని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మస్తాన్, చందు, నాగేంద్రబాబు, హరి, అశోక్ సుధాకర్ తదితర కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way