కృష్ణా జిల్లాలో జనసేన పార్టీలోకి వైసీపీ నాయకులు చేరిక

  మచిలీపట్నం, (జనస్వరం) : మచిలీపట్నం, జనసేన పార్టీ కృష్ణా జిల్లా పార్టీ కార్యాలయం నందు కృష్ణా జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ బండ్రెడీ రామకృష్ణ మరియు జనసేన పార్టీ కృష్ణా జిల్లా సంయుక్త కార్యదర్శి శ్రీ వేల్పురి నానాజీ ఆధ్వర్యంలో కైకలూరు నియోజకవర్గం, ముదినేపల్లి మండల అధికార వైకాపా పార్టీ నాయకులు వీరంకి వెంకయ్య, ఉతుకూరు గ్రామ సర్పంచ్‌ సుడొబత్తుల శ్రీనివాసరావు, మిరియాల రవితేజ, పుష్పాల సాంబశివరావు, ముత్యాల మణికంఠ జనసేనపార్టీ సిద్దాంతాలు, శ్రీ పవన్‌ కళ్యాణ్‌ నాయకత్వం నచ్చి జనసేన పార్టీలో చేరడం జరిగినది. ఈ కార్యక్రమంలో కైకలూరు నియోజకవర్గ జనసేన నాయకులు దూసనపుది బ్రహ్మాజీ, మోతేపల్లి హనుమ, పోకుల కృష్ణ, అంబుల భరత్‌, వాలిశెట్టి బాబీ, మల్లంపల్లి వీరబాబు, కురుచేతి నాగేంద్ర, సత్యవోలు గణేష్‌, రవితేజ, జనసైనికులు పాల్గొన్నారు.

See also  నరవ గ్రామంలోని సమస్యలపై అధికారులకు వినతిపత్రం అందించిన వబ్బిన శ్రీకాంత్