పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వారోత్సవాల సందర్భంగా జనసేన NRI సేవా సమితి కువైట్ వారి ఆధ్వర్యంలో 8వ రోజు సేవా కార్యక్రమాలు

          జనసేన NRI సేవా సమితి కువైట్ ఆధ్వర్యంలో జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకలో భాగంగా 8వ రోజు రేణిగుంటలోని అభయక్షేత్రంలో 200 మందికి శ్రీ పలుకూరి విజయభాస్కర్ దాతగా అన్నదాన వితరణ కార్యక్రమం జరిగింది. కరోనా సమయంలో అభయక్షేత్రంలోని అభాగ్యులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించినందుకు అభయక్షేత్రం నిర్వాహకురాలు తస్లీమా గారు హర్షం వ్యక్తం చేశారు. అలాగే వారు మాట్లాడుతూ జనసేన ఎన్నారై సేవా సమితి కువైట్ వారు చేస్తున్న సేవలు ఎంతో అభినందనీయని, ఈ సందర్భంగా అధ్యక్షులు శ్రీ రామచంద్ర నాయక్, ఉపాద్యక్షులు శ్రీ పగడాల అంజన్ కుమార్, నాయకులు శ్రీ కంచన శ్రీకాంత్, శ్రీ మాదాసు నరసింహ, దండు చంద్రశేఖర్, శ్రీ మోహన్, కుప్పాల భాస్కర్ గారికి అభినందనలు తెలిపారు.  ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన నాయకులు మర్రి రెడ్డిప్రసాద్, నగిరి పాటి మహేష్ బాబు పాల్గొన్నారు. అలాగే జనసేన ఎన్ఆర్ఐ సేవ సమితి కువైట్ టీమ్ లో సభ్యుడైన కాలప్ప గారి రాము గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది .అలాగే జనసేన నాయకుడు బాలి శెట్టి వెంకటేష్, హరీష్, కొండేటి భాస్కర్, తిరుపతి జిల్లా జనసేన సంయుక్త కార్యదర్శి కీర్తన గారు, ఉయ్యాల మధులత తదితరులు పాల్గొనడం జరిగింది.