
జనసేన NRI సేవా సమితి కువైట్ జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకల్లో భాగంగా 30రోజులు 30ప్రాంతాలలో 30 సేవా కార్యక్రమాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అట్టడుగు వర్గాల మహిళల అభ్యున్నతే జనసేన పార్టీ లక్ష్యం ధ్యేయం. జనసేన ఎన్నారై సేవా సమితి కువైట్ గౌరవ సభ్యులు పుప్పాల భాస్కర్ దాతృత్వంతో కుప్పాల వైష్ణవి జన్మదిన శుభ సందర్భంగా అనంతపురం జిల్లాకు చెందిన జన సైనికుడు నరేష్ కు పదివేల రూపాయలు ఆర్థిక సహాయం చేయబడినది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా విచ్చేసిన అనంతపురం జిల్లా అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షుడు భవాని రవికుమార్ మరియు అనంతపురం జనసేనపార్టీ ఉపాధ్యక్షులు అడ్వకేట్ జయరాం రెడ్డి గారు, ఈశ్వర్ పాల్గొన్నారు. అఖిల భారత చిరంజీవి యువత అనంతపురం జిల్లా అధ్యక్షుడు భవాని రవికుమార్ మాట్లాడుతూ నిరుపేద జనసైనికుడికి అండగా ఉండేందుకు, జనసేన ఎన్నారై సేవా సమితి కువైట్ వారు చేస్తున్న సేవలు ఎంతో అభినందనీయని, ఈ సందర్భంగా అధ్యక్షులు శ్రీ రామచంద్ర నాయక్, ఉపాద్యక్షులు శ్రీ పగడాల అంజన్ కుమార్, నాయకులు శ్రీ కంచన శ్రీకాంత్, శ్రీ మాదాసు నరసింహ, దండు చంద్రశేఖర్, శ్రీ మోహన్, కుప్పాల భాస్కర్ గారికి అభినందనలు తెలిపారు. కువైట్ వాళ్ళు భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవలు కొనసాగించాలని జిల్లా నాయకులు కొనియాడారు. జయరాం రెడ్డి గారు నరేష్ కు సాయం చేయడం అభినందనీయమని, తాను జనసేన పార్టీ బలోపేతం కోసం సోషల్ మీడియా వేదికగా పని చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శులు నాగేంద్ర గారు, జనసేన జిల్లా నాయకులు బాబు రావు గారు, S.K.U - రమణ, ఈశ్వర్ గారు, రామ్ చరణ్ ఫ్యాన్స్ అధ్యక్షుడు హుస్సేన్, చోటు, విజయ్, కృష్ణ, సిద్దు, పామురాయి రామాంజనేయులు, హరీష్, చిన్నా తదితరులు పాల్గొన్నారు.