బొండపల్లి గ్రామంలో6వ రోజు జనవాణి – జన చైతన్య యాత్ర

బొండపల్లి

         చీపురుపల్లి ( జనస్వరం ) : గరివిడి మండలం బొండపల్లి గ్రామంలో  జనసైనికులు ఆధ్వర్యంలో 6వ రోజు జనవాణి – జన చైతన్య యాత్రలో భాగంగా బొండపల్లి గ్రామంలో జరిగింది. ప్రతి గడపకు పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలను ఆశయాలను, మేనిఫెస్టో తీసుకెళ్లడం జరిగింది. మరియు ముఖ్యంగా రైతులకు రుణమాఫీ కల్పించమని, వెళ్లిన ప్రతి ఇళ్లలో తాగునీటి సమస్యలు మరియు హౌస్సింగ్ బిల్లుల గురించి పరిష్కరించమని గ్రామ ప్రజలు వారి సమస్యలను తెలియపరిచారు. అలాగే గ్రామంలో మాకు ఊహించని అశేషమైన ప్రజల స్పందన లభించిందన్నారు. ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ గారికి ఒక అవకాశం ఇద్దాం అనే మాటే వినిపిస్తుందన్నారు. గ్రామం మొత్తం ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజలు సహకారం లభించినందున పవన్ కళ్యాణ్ గారి తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఇలాగే మిగిలిన నియోజకవర్గంలో ఉన్న గ్రామాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు సిద్ధాంతాలను ఆశయాలను సామాన్య ప్రజల కోసం ఆయన ఏం చేస్తారో అన్నది ప్రతి ఒక్కరికి తెలియజేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్డి ప్రతాప్, పండు, మని, వెంకటేష్, రామ్, ధను, కళ్యాణ్ మరియు నియోజకవర్గ జనసైనికులు పెద్ది వెంకటేష్, అగురు వినోద్ కుమార్, గేడ్డి గొల్లబాబు, చందక బాలకృష్ణ, బాకూరి శ్రీను, లెంక జగదీశ్, పైల ధనుంజయ, రెడ్డి ప్రతాప్ , చిరంజీవి మరియు జనసైనికులు పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way