అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజవర్గంలోక్రియాశీలక సభ్యత్వ ప్రారంభోత్సవ కార్యక్రమంలో టిడిపి కి చెందిన కార్యకర్తలు 50 కుటుంబాలు PAC సభ్యులు శ్రీ మధుసూదన్ గారు, రాయలసీమ సంయుక్త కమిటీ కన్వీనర్ శ్రీ T. C వరుణ్ గారి సమక్షంలో జనసేన పార్టీలోకి చేరడం జరిగింది. శ్రీ మధుసూదన్ గారు మాట్లాడుతూ రాజకీయం డబ్బుతో ముడిపడిన వ్యవస్థ అని రాజకీయలవైపు కన్నెత్తి చూడలంటేనే భయపడేవారిని సైతం ఎంతో మంది యువకులకు ఆవకాశం కల్పించిన పార్టీ జనసేన అని అన్నారు. గ్రామాలు అభివృద్ధి చెందాలంటే యువతలో ప్రశ్నించేతత్వం రావాలని అప్పుడే అవినీతి జరగకుండా పారదర్శకంగా అభివృద్ది పనులు సక్రమంగా జరుగుతాయని తెలిపారు. నేటి వ్యవస్థ మార్పుకోసం జరుగుతున్న ఉద్యమాల్లో యువతరమే సింహాభాగంగా సాగుతుందని భావి భారత నిర్మాణం యువత చేతుల్లోనే ఉందని గుర్తుచేశారు. దేశానికి యువత ప్రధాన సంపద బలమైన ఆయుధం లాంటి వారని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అని అన్నారు. నియోజకవర్గంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా ముందుగా స్పందించి పరిష్కారం చెప్పేది ఒక్క జనసేన మాత్రమే అని ఆయన అన్నారు. పార్టీలతో, కులాలతో మతాలతో సంబంధం లేకుండా అందరికి సమన్యాయం చేసేది ఒక్క జనసేన మాత్రమే అని చెప్పారు. జనసేన పార్టీలో నిత్యం పార్టీ కోసం కష్టపడుతున్న జనసైనికులకు క్రీయాశీలక సభ్యత్వం ఏర్పాటు చేశారన్నారు. ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పుట్టపర్తి జనసేన నాయకులు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com