Search
Close this search box.
Search
Close this search box.

రాయచోటిని జిల్లా కేంద్రంగా వ్యతిరేకిస్తూ రైల్వేకోడూరు JAC ఆధ్వర్యంలో 3వ రోజు నిరవధిక రిలే నిరాహార దీక్ష

రైల్వేకోడూరు

        రైల్వేకోడూరు ( జనస్వరం ) : అన్నమయ్య నడయాడిన జన్మస్థానం రాజ౦పేటను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని రైల్వే కోడూరు JAC డిమాండ్ చేస్తుంది. ఈ పోరాటానికి జనసేన పార్టీ తరుపున జనసేన నాయకులు మద్దతు ఇచ్చారు. జనసేన నాయకులు మాట్లాడుతూ తీవ్ర నీటి తీవ్రత, సదుపాయాల కొరత ఉన్నటువంటి రాయచోటిని జిల్లా కేంద్రంగా ప్రకటన చేయడం హాస్యాస్పదమనన్నారు. తక్షణమే ప్రభుత్వం ప్రకటనను వెనక్కి తీసుకొని లక్షలాది మంది మనోభావాల్ని గౌరవిస్తూ రాజంపేట ను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని కోరారు. అలాగే రైల్వే కోడూరును దశాబ్దాల నాటి డిమాండ్ బాలాజీ జిల్లాలో కలిపేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని రైల్వేకోడూరు జెఎసి ప్రభుత్వానికి తెలియజేశారు. మూడో రోజు రిలే దీక్షలో మర్రి రెడ్డిప్రసాద్, ముత్యాల కిశోర్, అ౦కిశెట్టి మణి, ఉత్తరాది శివకుమార్, నగిరి పాటి మహేష్, అంకిపల్లి అఖిల్ కల్యాణ్, శంకర, సుబ్బారావు మరియు జెఎసి నాయకులు హేమరాజు, నవీన్ కుమార్ మొదలగు వారు పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way