జనసేన NRI సేవా సమితి కువైట్ అధ్యక్షులు శ్రీ రామచంద్ర నాయక్ గారి నేతృత్వంలో రైల్వేకోడూరు నియోజకవర్గంలో గుండాల పల్లి గ్రామంలో పగడాల అంజన్ కుమార్ ఆధ్వర్యంలో అంజన్ కుమార్ నాన్నగారు చెంగయ్య జ్ఞాపకార్థంతో ఐదుగురి పేద మహిళలకు కుట్టు మిషన్లు ఆర్థిక సహాయం అందించారు. జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాతం శెట్టి నాగేంద్ర, చిట్వేలి జనసేన నాయకులు మాదాసు నరసింహ చేతుల మీద అందజేయడం జరిగింది. రాష్ట్ర నాయకులు తాత శెట్టి నాగేంద్ర గారు మాట్లాడుతూ ఎక్కడో కువైట్ లో ఉంటూ ఇంతటి మహోన్నతమైన కార్యక్రమాలు చేపడుతున్న జనసేన ఎన్నారై గౌరవ సభ్యులందరికీ మరియు జనసేన ఎన్నారై సేవాసమితి టీం సభ్యులందరికీ ముఖ్యంగా రామ్ చందర్ నాయక్, కాంచన శ్రీకాంత్, పగడాల అంజన్ కుమార్, దండు చంద్రశేఖర్, మాదాసు నరసింహ గారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సర్పంచ్ వీర మహిళ సంయుక్త, రాష్ట్ర వీర మహిళ పుప్పాల జ్యోతి, సింగిరి శివమ్మ, మాధవి, పగడాల నరసింహులు, మైసూర్ వారిపల్లి ఎంపీటీసీ అభ్యర్థి వరికూటి నాగరాజు, రైల్వే కోడూర్ నియోజకవర్గ యువ నాయకులు ముత్యాల కిషోర్, మర్రి రెడ్డి ప్రసాద్, నగిరి పాటి మహేష్, ప్రిన్స్ నవీన్, మాదాసు శివ, రాయల్, శ్రీకారం, ప్రకాష్, ఓబనపల్లి శివ, సూరారం సాయి, బాలు తదితరులు పాల్గొన్నారు.
