
ఆమదాలవలస, (జనస్వరం) : శ్రీకాకుళం జిల్లా, ఆముదాలవలస నియోజకవర్గంలో 11వ రోజు జనంతో – జనసేన కార్యక్రమం వావం గ్రామంలో నిర్వహించారు. మండుటెండలో ప్రజలు దీవినలతో ముగించడం జరిగింది. జనసేన నాయకులు కొత్తకోట నాగేంద్ర, కోరుకొండ మల్లేశ్వరావు, సిక్కోలు విక్రమ్ (ఎంపీటీసీ) ఆధ్వర్యంలో ఆముదాలవలస నియోజకవర్గం, వావం గ్రామంలో ప్రజలు సమస్యలుపై, పార్టీ సిద్ధాంతాలు అతను చేసిన సేవా కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకొని వెళ్లి వావం గ్రామంలో సమస్యలు (ముఖ్యంగా కాలువలు సమస్యలు) గుర్తించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంతోష్, శ్రీను, రమేష్, మోహన్, జగదీశ్, ప్రసాద్, జైరాం, గ్రామ యువత తదితరులు పాల్గొన్నారు.