అన్నిట్లో లంచం, సంఘ మిత్ర లోన్లలో సైతం 10 వేలు లంచం ఇవ్వాల్సిందే

    శ్రీకాళహస్తి ( జనస్వరం ) : రేణిగుంట పట్టణంలో మిరియాల సాహెబ్ వీదిలో ఇంటింటికీ ప్రచార కార్యక్రమంను నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జి వినుత కోటా నిర్వహించారు. పట్టణంలో ప్రచారం నిర్వహించి ఉమ్మడి మినీ మానిఫెస్టోను ప్రజలకు వివరించడం జరిగింది. రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం అవశ్యకతను వివరించడం జరిగింది. మరియు ప్రజలకు ఈ వైసీపీ ప్రభుత్వం మరియు స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మదుసుధన్ రెడ్డి చేస్తున్న అవినీతి, అక్రమాలను, దోపిడీలను వివరించడం జరిగింది. రానున్న ఎన్నికల్లో జనసేన ఉమ్మడి ప్రభుత్వంను ఆశీర్వదించాలని, తద్వారా రాష్ట్ర అభివృద్దికి సహకరించాలని కోరడం జరిగింది. ఏ ప్రభుత్వ కార్యాలయంలోని లంచం లేనిదే ఒక్క పని చెయ్యడం లేదు, ఆఖరికి సంఘ మిత్ర లోన్లలో సైతం లంచాలు అని మహిళలు తెలిపారు, నీటి సమస్య తో ఇబ్బంది పడుతున్నట్టు తెలిపారు.  డ్రైనేజ్ కాలువలు అస్సలు శుభ్రం చెయ్యడం లేదని తెలిపారు.  ,ప్రభుత్వం వచ్చిన వెంటనే సమస్యలు పరిష్కరిస్తామని ప్రజలకి హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో రేణిగుంట పట్టణ అధ్యక్షులు భాగ్య లక్ష్మి, మండల అధ్యక్షుడు చిన్నతోటి నాగరాజు , ఉపాధ్యక్షులు వాకాటి బాలాజీ, నాయకులు లోకేష్ , శంకర్, అనురాధ, భాస్కర్ బాబు, జయలలిత, గోవర్ధన్, శ్రీనివాసులు, చిన్న మురళి, బసవ పున్నయ్య , రవి కుమార్ రెడ్డి, జ్యోతి రామ్, హేమంత్ గౌడ్ , రాజేష్, సురేష్, జనసైనికులు మణికంఠ, కుమార్, కిషోర్, ధనుష్, సంతోష్, ప్రణీత్, పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way