అనంతపురం జిల్లా వాటా కింద 100 TMC సాగు జలాలు అందించాలి : జనసేన నాయకులు

అనంతపురం

                   అనంతపురం ( జనస్వరం ):: జిల్లాలో 80 శాతం మంది వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు. ఇటు వర్షపాతం లేక అటు భూగర్భ జలాలు ఇంకిపోతూ అనావృష్టితో కనీసం జిల్లాలో 90 శాతం రైతులు సంవత్సరానికి ఒక పంటకు నోచుకోలేక పోతున్నారని జనసేన నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.  అనాదిగా ఈ కరువు జిల్లాను పీడిస్తూ రైతులకు వ్యవసాయం కలసిరాక ఆకలిచావులతో, వలసలతో, కూలీలగానో, స్టోర్ బియ్యం పై ఆధారపడి అర్ధాకలితో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతూ జిల్లా వెనకబాటుతనానికి గురవుతోందని అన్నారు. వీటన్నింటికి ఒకటే పరిష్కారం అనంతపురం జిల్లా వాటా కింద 100 TMC సాగు జలాలు అందించాలన్నారు. జనసేన పార్టీ తరపున జిల్లాలోని ప్రతి గ్రామం తిరిగి సాగుజలాలకై పోరాటం చేయదలచుకున్నామని అందుకు భవిష్యత్తు కార్యచారణ రూపొందిస్తున్నామని అన్నారు. ఈ సాగుజలాలపై ఉపాధ్యాయులు 100 tmc రామాంజనేయులు గారు గత 15 సంవత్సరాల నుండి పోరాటం చేస్తున్నారు. మేము కూడా జనసేన పార్టీ నుండి అనంతపురం జిల్లా కు 100 tmc సాగుజలాలు అందేంతవరకు ఉద్యమం చేయ తలపెట్టినామని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు శ్రీనివాస్, విశ్వనాథ్ జనసేన, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way