వైసీపీ పార్టీ నుండి జనసేన పార్టీలోకి 10 కుటుంబాలు చేరిక

     ధర్మవరం ( జనస్వరం ) : జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు నచ్చి వైసీపీ పార్టీ నుండి జనసేన పార్టీలోకి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి సమక్షంలో ధర్మవరం పట్టణం 29వ వార్డు సుందరయ్య నగర్, సత్య సాయి నగర్ నుండి చెందిన 10 మంది కుటుంబాలు చేరడం జరిగింది. చేరిన వారి పేర్లు కన్నపనేని రాజేష్, గంతిమేరి నారాయణస్వామి, గూడూరు నరేష్, సాకే ఓబులేష్, కొవూరు దిలీప్ కుమార్, గొర్రె కేద్రీనాథ్, గంతిమేరి బాబు మరియు మొదలగున వారు చేరారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ పార్టీలోకి చేరిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియచేసుకుంటూ కార్యకర్తల కోసం నిరంతరం అందుబాటులో ఉంటూ ఏ ఆపద వచ్చిన ముందు ఉంటానని హామీ ఇచ్చారు. అలాగే ప్రతి కార్యకర్త సైనికుడిలా గా పనిచేసి జనసేన పార్టీని గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు నిర్మిద్దామని చెప్పి పిలుపునివ్వడం జరిగింది.పార్టీలోకి చేరిన యువత మాట్లాడుతూ యువతను జనసేన పార్టీ అయితేనే ఆదుకుంటుందని ధర్మవరంలో మధు అన్న గెలిస్తేనే ధర్మవరం అభివృద్ధి చెందుతుందని చేనేతలు పడుతున్న కష్టాలు,యువత పడుతున్న కష్టాలు ఇవన్నీ మధు అన్న ఎమ్మెల్యే అయ్యాక తీర్చి ప్రతి ఒక్కరికి అండగా ఉంటారన్న నమ్మకంతోనే మేము జనసేన పార్టీలో చేరినట్లు వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తలారి ప్రతాప్, కుల్లం పల్లి రమేష్, మురెప్ప గారి శంకర్ నాయుడు, నారాయణస్వామి
మరియు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way